హైదరాబాద్, మార్చి 10 (బిజినెస్ డెస్క్): దేశంలోనే తొలి బోయింగ్ ఫ్రైటర్ కన్వర్షన్ లైన్ హైదరాబాద్లో వస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిదాయక నిర్ణయాల నేపథ్యంలో జీఎమ్మార్ ఏరో టెక్నిక్తో శుక్రవారం బోయింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇప్పటికే భారత్లో మొట్టమొదటి బోయింగ్ సైప్లెయర్గా జీఎమ్మార్ ఏరో టెక్నిక్కు పేరున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఒప్పందం.. ఇరు సంస్థలను మరింత దగ్గరికి చేర్చినైట్టెంది. కాగా, ప్రపంచంలో అతిపెద్ద విమానాలను తయారుచేస్తున్న సంస్థల్లో అమెరికాకు చెందిన బోయింగ్ ఒకటన్న సంగతి విదితమే. హైదరాబాద్లో రాబోతున్న ఈ బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రైటర్ (బీసీఎఫ్) లైన్లో.. ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్లను సరుకు రవాణా విమానాలుగా మార్చనున్నారు. ప్రస్తుతం కార్గో ప్లేన్లకు డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో బీసీఎఫ్లో దేశ, విదేశీ విమానాలను జీఎమ్మార్ ఏరో టెక్నిక్ సహకారంతో బోయింగ్ కన్వర్షన్ చేయనున్నది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా పెట్టుబడులు, ఇతరత్రా ఆర్థికపరమైన సమాచారమేమీ తెలియరాలేదు.
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ)లోగల జీఎమ్మార్ ఏరో టెక్నిక్కు చెందిన ఏయిర్ఫ్రేమ్ మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్ఓ) కేంద్రంలో ఈ కన్వర్షన్ లైన్ రానున్నది. దేశంలోని చిన్నతరహా విమానాల అవసరాలను, అలాగే ఆసియా, ఆఫ్రికా రీజియన్ దేశాలకు ఈ కన్వర్షన్ లైన్ సేవలు అందనున్నాయి. ఇదిలావుంటే బోయింగ్కు ప్యాసింజర్ విమానాలను సరుకు రవాణా విమానాలుగా మార్చడంలో 40 ఏండ్ల అనుభవం ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 1,720కిపైగా ప్యాసింజర్ విమానాలను సరుకు రవాణా విమానాలుగా మార్చాల్సిన అవసరం ఉందని బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలీల్ గుప్తే అంటున్నారు.
హైదరాబాద్లో ఈ కన్వర్షన్ లైన్ కార్యకలాపాలు ఒక్కసారి మొదలైతే బోయింగ్ 737-800 ప్యాసింజర్ విమానాలు.. సరుకు రవాణా విమానాలుగా మారిపోనున్నాయి. వచ్చే ఏడాదిన్నర కాలంలో కన్వర్షన్ లైన్పై పనులు మొదలవుతాయన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఇరు సంస్థలు వ్యక్తం చేశాయి. భారతీయ ఎయిర్ కార్గో ఏటా సగటున 6.3 శాతం వృద్ధి చెందుతున్నదని బోయింగ్ అంచనా. తయారీ, ఈ-కామర్స్ రంగాలే ఇందులో కీలకమంటున్నది. ప్రస్తుతం భారత్లో బోయింగ్కు 300లకుపైగా సైప్లెయర్లున్నారు. ఏటా రూ.8,300 కోట్లకుపైగా లావాదేవీలు జరుగుతాయని సమాచారం.
భారతీయ మార్కెట్ ఇతర మార్కెట్లలా కాదు. ఎందుకంటే ఇక్కడ విశేషమైన సామర్థ్యంతో విస్తృత అవకాశాలున్నాయి. పౌర, రక్షణ విమానయాన రంగాల్లో అభివృద్ధికి కొదవే లేదు. ఇక ఈ రీజియన్లో కార్గో రంగ వృద్ధికి జీఎమ్మార్ ఏరో టెక్నిక్తో మా భాగస్వామ్యం మరింతగా దోహదపడగలదు.
– సలీల్ గుప్తే, బోయింగ్ ఇండియా అధ్యక్షుడు
కార్గో వృద్ధికి మద్దతునిచ్చేలా బోయింగ్ పెట్టుబడులకు ఈ తాజా ఒప్పందం కృషి చేయగలదు. అలాగే దేశంలో ఎయిర్క్రాఫ్ట్ మార్పులకు సం బంధించి సంక్లిష్ట సామర్థ్యాల విస్తరణకు, ప్రపంచ శ్రేణి మెయింటేనెన్స్, రిపేర్, ఓవరాల్ (ఎంఆర్ఓ) సేవలకు కూడా కలిసి రాగలదని భావిస్తున్నాం.
– అశోక్ గోపీనాథ్, జీఎమ్మార్ ఏరో టెక్నిక్ సీఈవో