eSIM | కేంద్రం ఆదేశాల మేరకు గూగుల్, ఆపిల్ కంపెనీలు యాప్స్టోర్ నుంచి రెండు మొబైల్ యాప్లను డిలీట్ చేశాయి. ఎయిర్అలో (Airalo) హోలాఫ్లయ్ (Holafly) యాప్లు ఈ-సిమ్ సేవలను అందిస్తున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఆదేశాల మేరకు ఆపిల్, గూగుల్ తొలగించాయి. వాస్తవానికి కంపెనీలు భారత్లో ఈ-సిమ్ సేవలను అందించేందుకు, ప్రారంభానికి ముందు డీఓటీ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ రెండు కంపెనీలు ఎన్ఓసీ సర్టిఫికెట్ను తీసుకోలేదు. ఈ రెండు కంపెనీల్లో ఒకటి సింగపూర్కు చెందినది కాగా.. మరొకటి స్పెయిన్కు చెందింది. ఈ రెండు కంపెనీలు ఎన్ఓసీ తీసుకోలేదు. అధీకృత డీలర్ల ద్వారా మాత్రమే ఈ సిమ్ల సేవలను అందించవచ్చు. ఈ సిమ్ కార్డ్ను జారీ చేసే సమయంలో పాస్పోర్ట్ కాపీ, వీసా వంటి ఐడెంటిటీ ప్రూఫ్ను కస్టమర్ల నుంచి సేకరించాల్సి ఉంటుంది. వాటిని అధీకృత విక్రేతలు తప్పనిసరిగా గ్లోబల్ సిమ్ సెక్యూరిటీ ఏజెన్సీకి వివరాలను అందించాల్సి ఉంటుంది.
ఈ-సిమ్ను క్యూఆర్ ద్వారా యాక్టివేట్ చేసిన ప్రత్యేకమైన సాఫ్ట్వేర్తో పని చేస్తుంది. సంబంధిత టెలికాం కంపెనీ ద్వారా మాత్రమే ఈ-సిమ్ను యాక్టివేట్ చేస్తుంది. ఇందులో ఫిజికల్ సిమ్ కార్డ్ అవసరం ఉండదు. ప్రస్తుతం ఐఫోన్ 8లో ఈ-సిమ్లను ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అయితే, భారత్లో సైబర్ నేరాల కోసం మోసగాళ్లు అంతర్జాతీయ ఫోన్ నంబర్లలో సిమ్లను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్అలో, హోలాఫ్లయ్ కంపెనీలకు చెందిన సిమ్ యాప్లను నిషేధించినా.. ఇంకా పలు ఈ-సిమ్ ప్రొవైడర్లు భారత్లో అందుబాటులో సేవలందిస్తున్నాయని ఓ నివేదిక పేర్కొంది.