ముంబై, మార్చి 11: భారత్ తన జీడీపీ వృద్ధి రేటును ఇతర దేశాలతో పోల్చుకుని, మిన్నగా ఉందంటూ సంబరపడటం సరికాదని, వాస్తవానికి మన దేశంలో ఉపాధి కల్పనకు అవసరమైన వృద్ధి సాధనపై దృష్టినిలపాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ విరాల్ ఆచార్య సూచించారు. జాబ్స్ మార్కెట్లో ప్రవేశిస్తున్నవారికి ఉద్యోగాల సృష్టి కోసం అవసరమైన వృద్ధి రేటుపై ఆలోచనమాని, మిగతా ప్రపంచంతో పోల్చుకుని ఉపయోగం లేదన్నారు. యూట్యూబ్లో ఒక పాడ్కాస్ట్లో ఆచార్య మాట్లాడుతూ భారత్ తన ఆలోచనా విధానాన్ని మారుచకోవాలని, ఇతర దేశాలతో పోలిక కేవలం ఐఎంఎఫ్ టేబుల్స్ మీదకే పనికొస్తుందని, దానిబదులు మరిన్ని ఉద్యోగాలు సృష్టించడానికి అవసరమైన వృద్ధిపై దృష్టి నిలపాలన్నారు. ప్రభుత్వం కొత్త విధానాలు రూపొందిస్తున్నా, దురదృష్టవశాత్తూ అంతటి వృద్ధిని మనం సాధించలేకపోయామన్నారు.