ముంబై: ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీ మాగ్మా ఫిన్కార్ప్ లిమిటెడ్ నూతన ఛైర్మన్గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదార్ పునావాలాను నియమించినట్లు సంస్థ సోమవారం ప్రకటించింది. పునావాలా ప్రస్తుతం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్ కరోనా వ్యాక్సీన్ను భారత్లో సీరం కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.
ఈనెల ఆరంభంలో మాగ్మా కంపెనీలో పునావాలా ఆధ్వర్యంలోని రైజింగ్ సన్ హోల్డింగ్స్ 3,456కోట్ల పెట్టుబడి పెట్టింది. మేనేజ్మెంట్ మార్పుల్లో భాగంగా కొత్త ఛైర్మన్గా పునావాలాను నియమించింది. త్వరలో మాగ్మా కంపెనీ పూనావాలా గ్రూప్ కంపెనీగా మారనుంది.