Jeet Adani engagement | భారత్లో రెండో అతిపెద్ద కుబేరుడు గౌతం అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ ఓ ఇంటివాడు కానున్నాడు. ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్షా గారాల పట్టి దివ షాతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. వీరిద్దరి నిశ్చితార్థం అహ్మదాబాద్లో ఆదివారం జరిగింది. కాబోయే దంపతులిద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. పూర్తిగా లో-ప్రొఫైల్గా జరిగిన వేడుకలో ఇరు కుటుంబాల బంధువులు, సన్నిహిత మిత్రులు పాల్గొన్నారు. వారి వివాహ మూహూర్తం ఇంకా ఖరారు కాలేదు. ఈ ఏడాది చివరిలో గానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ జీత్ అదానీ-దివ షా దంపతులు కానున్నారని సమాచారం.
గౌతం అదానీ చిన్న కోడలు కానున్న దివ షా.. ముంబై కేంద్రంగా వజ్రాల వ్యాపారం చేస్తున్న సీ దినేష్ అండ్ కో-ప్రైవేట్ లిమిటెడ్ అధినేత జైమిన్షా గారాల పట్టి. నిశ్చితార్థ వేడుకకు కాబోయే వధూ వరులు ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దుస్తులతో అందరినీ అలరించారు.
జీత్ అదానీ ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆర్థిక విభాగం వైస్ప్రెసిడెంట్గా ఉన్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెనుస్య్వేలేనియా స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ అప్లయిడ్ సైన్సెస్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన జీత్ అదానీ, 2019లో అదానీ గ్రూప్లో జాయిన్ అయ్యారు. అదానీ ఎయిర్పోర్ట్స్, అదానీ డిజిటల్ ల్యాబ్స్కు సారధ్యం వహిస్తున్నారు. అదానీ గ్రూప్ కంపెనీలో స్ట్రాటర్జిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్స్, ప్రభుత్వ పాలసీలను పర్యవేక్షిస్తారు. అదానీ పెద్ద కుమారుడు కరణ్, సిరైల్ షరాఫ్. పారిధి తనయ పారిధిని వివాహం చేసుకున్నారు. సిరైల్ షరాఫ్.. పేరొందిన కార్పొరేట్ వ్యవహారాల లాయర్.