న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: అదానీ గ్రూపునకు చెందిన అంబుజా సిమెంట్స్..మై హోమ్ గ్రూపునకు చెందిన సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ను హస్తగతం చేసుకున్నది. తమిళనాడులోని ట్యూటికోరిన్ వద్ద ఉన్న గ్రైండింగ్ యూనిట్ను రూ.413.75 కోట్లకు కొనుగోలు చేసింది.
1.5 మిలియన్ టన్నుల కెపాసిటీ కలిగిన మై హోమ్ గ్రూపునకు చెందిన సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ కొనుగోలుకు సంబంధించి ఇరు సంస్థలు ఒప్పందంపై సంతకాలు కూడా చేశారు. దక్షిదాది మార్కెట్లోవున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో అదానీ గ్రూపు ఈ కొనుగోలు జరిపింది. దీంతో అదానీ గ్రూపు సిమెంట్ ఉత్పత్తి సామర్థ్యం 78.9 మిలియన్ టన్నులకు చేరుకున్నది.