Adani | న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: రెన్యూవబుల్ ఎనర్జీ లో అదానీ గ్రూపు సంస్థలు దూసుకుపోతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గుజరాత్లో 2,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను ప్రారంభించింది. దీంతో గ్రూపు మొత్తం కెపాసిటీ 10,934 మెగావాట్లకు చేరుకున్నది.
10 వేల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి చేసిన దేశీయ సంస్థగా అదానీ గ్రూపు రికార్డు సృష్టించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2,848 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 7,393 మెగావాట్లు సౌర విద్యుత్ కాగా, 1,401 మెగావాట్లు పవన విద్యుత్, 2,140 మెగావాట్లు విండ్-సౌర హైబ్రిడ్ సామర్థ్యం కలిగివున్నది.