న్యూఢిల్లీ, నవంబర్ 2: దేశీయ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన అదానీ ఎంటర్ప్రైజెస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ నికర లాభం 50.57 శాతం తగ్గి రూ.227.82 కోట్లకు పడిపోయింది. ఏడాది క్రితం ఇది రూ.460.94 కోట్లుగా ఉన్నది. గత త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 41 శాతం తగ్గి రూ.38,175.23 కోట్ల నుంచి రూ.22,517.33 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం సంస్థ వద్ద రూ.1,242 కోట్ల నగదు నిల్వలున్నాయి.