హైదరాబాద్, డిసెంబర్ 4: ఫార్మా విడిభాగాల తయారీ సంస్థ యాక్సెంట్ మైక్రోసెల్.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నది. ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు సాగనున్న షేర్ శ్రేణి ధరను రూ.133-140గా నిర్ణయించింది. ఈ నెల 7న యాంకర్ పెట్టుబడిదారులకోసం షేర్లను విక్రయించనున్న సంస్థ.. మొత్తం ప్రక్రియ 12న ముగియనున్నదని పేర్కొంది. రూ.10 ముఖ విలువ కలిగిన 56 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనుండటంతో రూ.78.40 కోట్ల నిధులు సమకూరవచ్చునని అంచనావేస్తున్నది.