హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా స్టార్టప్ ల్యాండ్స్కేప్ను పునర్నిర్మించాలనే దృక్పథంతో ఇండియా స్టార్టప్ ఫౌండేషన్.. ఇండియా స్టార్టప్ ఫెస్ట్కు శ్రీకారం చుట్టింది. స్టార్టప్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, ఏంజిల్ ఇన్వెస్టర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా బెంగళూరులో ఆగస్టు 10-12 తేదీల్లో మూడు రోజులపాటు ఈ ఏడాది ఫెస్ట్ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం టీ-హబ్లో సన్నాహక కార్యక్రమాన్ని జరిపారు. ఫౌండేషన్ చైర్మన్ జేఏ చౌదరి మాట్లాడుతూ.. 10వేలకుపైగా స్టార్టప్ నిర్వాహకులు, 1,500 మంది ఇన్వెస్టర్లు వస్తున్నారని చెప్పారు.
టీ-హబ్ భేష్
హైదరాబాద్లోని స్టార్టప్ ఎకోసిస్టమ్ చాలా శక్తివంతమైందని, వేగంగా అభివృద్ధి చెందుతోందని చౌదరి కొనియాడారు. టీ-హబ్లోని ఇన్వెస్టర్ కనెక్ట్ వర్క్షాపుతో స్టార్టప్లు మంచి ప్రయోజాన్ని పొందుతున్నాయన్నారు. టీ-హబ్ సీఈవో ఎంఎస్ రావు మాట్లాడుతూ.. ఔత్సాహికులను విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో పలువురు పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు పాల్గొన్నారు.