E-Tractor | రైతుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ఆటోమొబైల్ కంపెనీలు తమ ఆర్ అండ్ డీ హబ్స్లో ట్రాక్టర్లు అభివృద్ధి చేస్తుంటాయి. కానీ, దానికి భిన్నంగా పంట పొలాల్లోనే బుల్లి ట్రాక్టర్ `మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0` పేరుతో డెవలప్ చేశారు రైతుగా మారిన ఇంజినీర్ నికుంజ్ కోరట్. ఈ ట్రాక్టర్ అభివృద్ధి చేయడానికి గుజరాత్లో నికుంజ్ బ్రదర్స్ సుమారు రూ.కోటి పెట్టుబడి పెట్టారు. ఈ `మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0`కు తాజాగా ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఏక్యాట్ – iCAT ) సర్టిఫికేషన్ కూడా వచ్చింది. పొలాలు దున్నడానికి కేవలం గంటకు రూ.10 ఖర్చు మాత్రమే.
రైతులకు అందుబాటులోకి తేవడానికి రూ.5.5 లక్షల ధర పెట్టాలని నిర్వహించారు. దీని కమర్షియలైజేషన్ కోసం నిధులు సాయం చేయాలని, ఇన్వెస్టర్లు మద్దతు ఇవ్వాలని. ఫేమ్ ( FAME ) సబ్సిడీ ఇవ్వాలని నికుంజ్ కొరాట్ కోరుతున్నారు.
నాలుగేండ్ల క్రితం ఢిల్లీలో ఎలక్ట్రిక్ రిక్షా ప్రభంజాన్ని చూశానని నికుంజ్ చెప్పారు. రోడ్డుపైకి ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నప్పుడు విద్యుత్ వాహనాలతో వ్యవసాయం ఎందుకు చేయకూడదని అనిపించిందని అన్నాడు. నికుంజ్ కొరాట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. `మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0` కేవలం నాలుగు గంటల్లో చార్జింగ్ అవుతుంది` అని చెప్పాడు. ఇది చిన్న డీజిల్ ట్రాక్టర్ మాదిరిగా ఉంటుందన్నాడు.
తాను ప్రతిపాదించిన ఈ-ట్రాక్ట్ 3.0 తయారీలో తమ సొంత గ్రామ రైతుల నుంచి మంచి సలహాలు వచ్చాయని నికుంజ్ కొరాట్ చెప్పాడు. తాను అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్ రూ.5.5 లక్షలు పెట్టి కొనుగోలు చేయడానికి రైతులు ముందుకు రావడం కష్టమేనన్నాడు. చిన్న డీజిల్ ట్రాక్టర్ రూ.2.5 లక్షలకే లభిస్తుందన్నాడు. దీని కొనుగోలు ఖర్చు కాస్త ఎక్కువైనా.. డీజిల్తో పోలిస్తే పదోవంతు ఖర్చు మాత్రమే సరిపోతుందన్నాడు. లిథియం ఐరన్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్టీ) ప్యాక్తో కూడిన లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ వినియోగించాల్సి ఉంటుందన్నాడు.
మారుత్ ఈ-ట్రాక్ట్ 3.0 లైఫ్ టైం 15 వేల గంటలు పని చేస్తుంది. గంటకు దాదాపు లీటర్ డీజిల్ ఖర్చయితే.. ఎలక్ట్రిక్ ట్రాక్టర్కు గంటకు రూ.10 మాత్రమే ఖర్చవుతుందని నికుంజ్ చెబుతున్నాడు. ఎలక్ట్రిక్ కార్లు, ఈ-బైక్లు, ఈ-స్కూటర్ల వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం అమలు చేస్తున్న ఫేమ్ స్కీమ్.. ట్రాక్టర్లకు కూడా పొడిగించాలని కోరుతున్నాడు. ఒకవేళ ఫేమ్ స్కీమ్ అమలైతే తమ ట్రాక్టర్పై రూ.1.5 లక్షల వరకు సబ్సిడీ వస్తుందని చెబుతున్నాడు.