Bank Defaulters | హైదరాబాద్, జూన్ 22 (స్పెషల్ టాస్క్ బ్యూరో నమస్తే తెలంగాణ): గడిచిన తొమ్మిదేండ్లలో రూ.15 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేసి ఎగవేతదారులకు మేలు చేసిన మోదీ సర్కారు.. ఉద్దేశపూర్వకంగా రుణాలను ఎగ్గొట్టినవారికి మళ్లీ రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడింది. కాంప్రమైజ్ సెటిల్మెంట్ (రాజీ పరిష్కారం) పేరిట ఈ ప్రక్రియకు తలుపుల్ని బార్లా తెరిచింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడినవారు ఎంతమంది ఉన్నారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. 2022 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వక ఎగవేతదార్ల సంఖ్య 16,044గా ఉన్నట్టు బ్యాంకు నివేదికలనుబట్టి తెలుస్తున్నది. రూ.3,46,479 కోట్ల రుణాలను ఎగ్గొట్టినట్టు సమాచారం. 85 శాతం రుణాలను (రూ.2.92 లక్షల కోట్లు) ప్రభుత్వ బ్యాంకుల నుంచే తీసుకొన్నట్టు తెలుస్తున్నది.