ముంబై, జూన్ 24: థర్డ్ పార్టీ లాజిస్టిక్ సేవల సంస్థ షాడోఫాక్స్ వచ్చే నెల రోజుల్లో 75 వేల మంది డెలివరీ పార్టనర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాజిస్టిక్ సేవలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ఈ భారీ స్థాయిలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆర్థికంగా స్వాతంత్య్రం/సంపాదించాలని కోరుకుంటున్న వారిని మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఒక్కో రైడర్ నెలకు గరిష్ఠంగా రూ.35 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందని, వీటితోపాటు రూ.7.5 లక్షల వరకు ఉచిత మెడికల్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నది సంస్థ. నచ్చిన సమయంలో పనిచేసుకునే అవకాశం కూడా సంస్థ కల్పిస్తున్నది. బైక్స్ లేదా సైకిల్ ద్వారా ఉత్పత్తులను డెలివరీ చేయాల్సి ఉంటుందని, ఒకవేళ ఇవి లేకపోతే ఎంపిక చేసిన నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను అద్దెకు కూడా ఇవ్వనున్నది సంస్థ.