ముంబై, జనవరి 2: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రకటించింది. 175 రోజుల కాలపరిమితితో సూపర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల నుంచి రూ.50 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ వడ్డీ వర్తించనున్నదని పేర్కొంది. స్వల్పకాలిక డిపాజిట్ చేయాలనుకునే ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలకు ఈ స్కీం ఉపయోగకరంగా ఉంటుందని బ్యాం కింగ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చే ఈ స్కీం స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపాయి.