Data Breach : ఆడియో, యాక్సెసరీస్ బ్రాండ్ బోట్ యూజర్ల వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. 75 లక్షల మంది బోట్ యూజర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్లో అమ్మకానికి ఉంచడం ఆందోళన రేకెత్తిస్తోంది. షాపిఫైజీయూవై అనే హ్యాకర్ ఈ దుశ్చర్యకు తెగబడినట్టు భావిస్తున్నారు.
డేటా ఉల్లంఘనతో బాధిత కస్టమర్లు ఆర్ధిక అవకతవకలు, ఫిషింగ్ స్కామ్స్కు గురయ్యే ప్రమాదం ఉంది. కస్టమర్ల పేర్లు, చిరునామా, కాంటాక్ట్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు, కస్టమర్ ఐడీల వంటి కీలక వివరాలు డార్క్ వెబ్పై హ్యాకర్లు అమ్మకానికి పెట్టారు. ఇక బోట్ సర్వర్ల నుంచి చౌర్యానికి గురైన డేటాతో పాటు ఇతర మార్గాల్లో హ్యాకర్లు సేకరించిన డేటా డార్క్ వెబ్లో అందుబాటులో ఉండటంతో సైబర్ నేరగాళ్లు ప్రజలను ఫిషింగ్, ఇతర ఆన్లైన్, ఫోన్ స్కామ్లతో మోసం చేయడం సులువవుతుంది.
డేటా ఉల్లంఘనలపై కంపెనీల నుంచి సమాచారం రాబట్టడం, కంపెనీలు కస్టమర్లకు నివేదించేలా చేయడంలో భారత్ ఇంకా వెనుకబడిఉందని ఈ ఉదంతం వెల్లడిస్తోంది. డేటా ఉల్లంఘనల విషయంలో ఇతర దేశాల్లో కంపెనీలు తమ కస్టమర్లకు సమాచారం చేరవేసేందుకు బాధ్యతతో వ్యవహరిస్తాయి.
Read More :
Aditya L1: ఇవాళ సంపూర్ణ సూర్యగ్రహణం.. కానీ ఆదిత్య ఎల్1కు ఆ అద్భుతం చిక్కదు