న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రూ.67,400 కోట్ల ఆదాయ పన్ను రిఫండ్ చెల్లింపులు జరిపినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలలో వెల్లడించింది. ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 30లోగా 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు రూ.67 వేల కోట్ల రిఫండ్ చేసినట్లు తెలిపింది. వీటిలో 22.61 లక్షల కేసులకు సంబంధించిన రూ.16,373 కోట్లు రిఫండ్ చేసిన సీబీడీటీ..కార్పొరేట్ ట్యాక్స్నకు సంబంధించి రూ.51 వేల కోట్లను తిరిగి చెల్లించింది.