న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాల్లో కదలాడుతుండటంతో మదుపరుల సంపద పరుగులు పెడుతున్నది. గత 3 రోజుల్లో బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ రూ. 6,39,437.31 కోట్లు ఎగబాకింది. బీఎస్ఈ సెన్సెక్స్ బుధవారం 789.70 పాయింట్లు పుంజుకోగా, గడిచిన మూడు రోజుల్లో 1,855.39 పాయింట్లు ఎగిసింది. ప్రస్తుతం సూచీ 49,733.84 వద్ద నిలిచింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ మొత్తంగా రూ. 2,08,76,479.11 కోట్లుగా ఉన్నది. బుధవారం ట్రేడింగ్లో 211.50 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ.. 14,864 వద్ద ముగిసింది.