న్యూఢిల్లీ, డిసెంబర్ 9: వచ్చే నెల ప్రథమార్ధంలో 5జీ టెస్ట్బెడ్ అందుబాటులోకి రావచ్చని టెలికం శాఖ కార్యదర్శి కే రాజరామన్ తెలిపారు. గురువారం ఇక్కడ ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్’లో మాట్లాడుతూ 5జీ టెస్ట్బెడ్ను జనవరి ఆరంభంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చే యోచనలో ఉందన్నారు. చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లతోపాటు పరిశ్రమలోని ఇతర సంస్థలు తమ సొల్యూషన్స్ను టెస్ట్ చేసుకునేందుకు ఈ 5జీ టెస్ట్బెడ్ అవసరం. దేశీయంగా 5జీ సాంకేతికతను ప్రోత్సహించడంలో భాగంగా 2018 మార్చిలో రూ.224 కోట్ల వ్యయంతో ఈ స్వదేశీ 5జీ టెస్ట్బెడ్ ఏర్పాటుకు టెలికం శాఖ ఆమోదం తెలిపింది. ఈ టెస్ట్బెడ్పై ఆయా కంపెనీలు తమ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్, నెట్వర్క్ కన్ఫిగరేషన్లను పరీక్షించుకోవచ్చు.