DATA Consumption | న్యూఢిల్లీ, మార్చి 20: 4జీ వినియోగదారులు వినియోగిస్తున్న డాటా కంటే 5జీ యూజర్లు 3.6 రెట్లు అధికంగా డాటాను వినియోగిస్తున్నారని నోకియా తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 2022 నుంచి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం నోకియా విడుదల చేసిన ‘మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్’ నివేదికలో స్పష్టంచేసింది.
2023లో మొత్తం వినియోగించిన డాటా లో 5జీ వాటా 15 శాతంగా ఉన్నది. 2023 లో ఒక్కో యూజర్ నెలకు సరాసరిగా 17.4 ఎక్సాబైట్స్ డాటాను వినియోగించారు.