TATA | న్యూఢిల్లీ, మార్చి 27: దేశవ్యాప్తంగా 5 వేల పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. ఇందుకోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)తో జట్టుకట్టింది. ఈ ఏడాది చివరి నాటికి హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకులతోపాటు ఇతర స్థలాల్లోనే ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నారు. దేశీయ రోడ్లపై 1.2 లక్షల టాటా ఈవీలు దూసుకుపోతుండటంతో వీటికి చార్జింగ్ ఇబ్బందులు రాకుండా ఉండేందుకు హెచ్పీసీఎల్తో జట్టుకట్టినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంతో హెచ్పీసీఎల్కి ఉన్న 21,500 పెట్రోల్ బంకుల్లో 5 వేల ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నది సంస్థ.