హైదరాబాద్, ఏప్రిల్ 11: టెక్నో పెయింట్స్..తన వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తున్నది. ఏపీలో రెండు, మధ్యప్రదేశ్లో ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రూ.46 కోట్ల నిధులను వెచ్చిస్తున్నట్టు ఫార్చూన్ గ్రూపు ఫౌండర్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా 26 వేల పాఠశాలలకు రంగులు వేసే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును టెక్నో పెయింట్స్ దక్కించుకున్నదన్నారు. దీంట్లో భాగంగా ఇప్పటికే 2 వేలకు పైగా పాఠశాలలకు కలర్స్ పూర్తయ్యాయని చెప్పారు.