ముంబై, జనవరి 9: ఈ సంవత్సరం ఐపీవోలు, సంబంధిత డీల్ మేకింగ్ కార్యకలాపాలు జోరుగా సాగుతాయని కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అంచనా వేస్తున్నది. 2021లో ఐపీవో డీల్స్ ద్వారా రికార్డుస్థాయిలో 50 బిలియన్ డాలర్ల (రూ.4.15 లక్షల కోట్లు) నిధుల సమీకరణ జరిగిందని, 2024లో ఈ స్థాయిని మించి లావాదేవీలు జరుగుతాయని అంచనా వేస్తున్నట్టు కొటక్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సీఈవో రమేష్ తెలిపారు. నవతరం టెక్ కంపెనీల నేతృత్వంలో ప్రైమరీ మార్కెట్ జోరు చూపిస్తుందన్నారు. ఈ సంవత్సరం మరిన్ని పెద్ద ఐపీవోలు మార్కెట్లోకి రావచ్చన్నారు.