Vehicle Sales | గత నెలలో వెహికల్స్ సేల్స్ ఓవరాల్గా 4.03 శాతం తగ్గుముఖం పట్టాయి. 2022 ఏప్రిల్లో 17,97,432 కార్లు అమ్ముడైతే, గత నెలలో 17,24,935 యూనిట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. కర్బన ఉద్గారాల నియంత్రణకు కేంద్రం తీసుకొచ్చిన రెండోదశ బీఎస్-6 ప్రమాణాల అమలు వల్లే వాహనాల విక్రయాలు తగ్గముఖం పట్టాయని చెబుతున్నారు.
ఆటోమొబైల్ డాలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) గురువారం గత నెల కార్ల విక్రయాల వివరాలు వెల్లడించింది. 2022తో పోలిస్తే కార్ల సేల్స్ ఒకశాతం తగ్గిపోయాయి. త్రీ వీలర్స్ సేల్స్ 57 శాతం పుంజుకుంటే, ట్రాక్టర్లు ఒకశాతం, కమర్షియల్ వెహికల్స్ సేల్స్ రెండు శాతం ఎక్కువయ్యాయి. రెండో దశ కర్బన ఉద్గార నిబంధనలు అమల్లోకి తేవడం వల్లే కార్ల సేల్స్ తగ్గాయని చెప్పారు ఫాడా ప్రెసిడెంట్ మనీశ్ రాజ్ సింఘానియా తెలిపారు. ఏప్రిల్ నుంచి కర్బన ఉద్గార నియంత్రణ నిబంధనలు కఠినతరం చేయడంతో కార్ల ధరలు పెరిగాయి. దీంతో చాలా మంది మార్చిలోనే కార్లు కొనుగోలు చేశారని మనీష్ రాజ్ సింఘానియా తెలిపారు.
గత ఎనిమిది నెలల్లో తొలిసారి ఏప్రిల్లో కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాది ఏప్రిల్ నెలలో 2,86,539 కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది ఏప్రిల్ లో 2,86,539 కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది 2,82,674 యూనిట్లకు పరిమితం అయ్యాయి. మారుతి సుజుకి 1.09 లక్షల కార్లు విక్రయించింది. దేశీయ కార్ల మార్కెటలో మారుతి వాటా 38.89 శాతం.
2022 ఏప్రిల్ నెలతో పోలిస్తే గత నెలలో టూ వీలర్ బైక్స్, స్కూటర్ల సేల్స్ ఏడు శాతం తగ్గాయి. ప్రీ-కొవిడ్ తో పోలిస్తే 19 శాతం తక్కువ. రిటైల్ మార్కెట్లో టూ వీలర్ సేల్స్ 12 శాతం తగ్గాయి. గతేదాది ఏప్రిల్ నెలలో 13.26 లక్షల బైక్స్, స్కూటర్లు అమ్ముడైతే, ఈ ఏడాది 12.28 లక్షల యూనిట్లకు పరిమితం అయ్యాయి. ఇదిలా ఉంటే కమర్షియల్ వెహికల్స్ సేల్స్ రెండు శాతం పెరగడం గమనార్హం.