న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: దేశవ్యాప్తంగా గృహ విక్రయాలు ఊపందుకున్నాయి. జూలై-సెప్టెంబర్ మధ్యదేశంలోని 8 మెట్రో నగరాల్లో అమ్మకాలు 49 శాతం పెరిగి 83,220 యూనిట్లకు చేరుకున్నట్లు ప్రముఖ కన్సల్టెన్సీ ప్రాప్టైగర్.కామ్ వెల్లడించింది.
నగరాల వారీగా చూస్తే హైదరాబాద్లో అమ్మకాలు 7,810 యూనిట్ల నుంచి 35 శాతం ఎగబాకి 10,570లకు చేరుకున్నాయని నివేదిక వెల్లడించింది. విరివిగా రుణాలు లభిస్తుండటం, పండుగ సీజన్లో ప్రత్యేక ఆఫర్లు అందిస్తుండటంతో వచ్చే త్రైమాసికాల్లోనూ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలున్నాయని ప్రాప్టైగర్ తెలిపింది.