న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: డిజిటల్ పేమెంట్స్ వేదిక ఫోన్పే.. తమ ఉద్యోగుల సంఖ్యను రెట్టింపునకుపైగా పెంచుకోవాలని చూస్తున్నది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరుకల్లా ఉద్యోగులను 5,400లకు పెంచుకోవాలనుకుంటున్నట్టు మంగళవారం తెలియజేసింది. ప్రస్తుతం ఫోన్పేలో 2,600 మంది ఉద్యోగులు ఉన్నారు. దీంతో రాబోయే ఈ 9 నెలల్లో మరో 2,800 మందికిపైగా ఫోన్పే నియమించుకోనున్నది. బెంగళూరు, పుణె, ముంబై, ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు ఉండనున్నాయి. ఇంజినీరింగ్, ప్రోడక్ట్, అనలిటిక్స్, బిజినెస్ డెవలప్మెంట్ విభాగాలతోపాటు సేల్స్ బృందాలను తీసుకోనున్నామని సంస్థ హెచ్ఆర్ అధిపతి మన్మీత్ సంధు తెలిపారు. వేతనాలను కూడా పెద్ద ఎత్తునే ఇవ్వనున్నారు.