న్యూఢిల్లీ, జూలై 25: కేసినోలు, ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ రేటును మంత్రుల గ్రూప్ ఖరారు చేసింది. బహుమతి సొమ్ము పోను మిగిలిన నికర ఆదాయంపై కాకుండా, మొత్తం బెట్టింగ్ ద్వారా సమకూరే స్థూల ఆదాయంపై 28 శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
మేఘాలయా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటుచేసిన మంత్రుల గ్రూప్ ఇందుకు సంబంధించిన నివేదికను ఆగస్టు తొలివారంలో జీఎస్టీ కౌన్సిల్కు అందచేస్తుంది. అటుతర్వాత కౌన్సిల్ తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది.