న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) టైర్-2 బాండ్లను జారీ చేయడంతో రూ.2,500 కోట్ల నిధులను సమీకరించింది. బాసెల్ 3కు లోబడి టైర్-2 బాండ్ల సిరీస్ 16 జారీ చేసిన బాండ్లకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని, కూపన్ రేటును 7.57 శాతంగా నిర్ణయించింది. పదేండ్ల కాలపరిమితితో అన్సెక్యూర్డ్, లిస్టెడ్, నాన్-కన్వర్టబుల్ లభించనున్నాయి.