న్యూఢిల్లీ, మే 10: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త మోడల్ సీ-క్లాస్ సెడాన్ను పరిచయం చేసింది. ఈ మోడల్ రూ.55 లక్షలు మొదలుకొని రూ.61 లక్షల గరిష్ఠ స్థాయిలో లభించనున్నది. వీటిలో పెట్రోల్ ఇంజిన్ కలిగిన సీ 200 మోడల్ ధర రూ.55 లక్షలుకాగా, డీజిల్ ఇంజిన్ కలిగిన సీ 220 మోడల్ రూ.56 లక్షలు, 330 డీ మోడల్ రూ.61 లక్షలుగా నిర్ణయించింది. ఐదో జనరేషన్గా విడుదల చేసిన ఈ కారుకోసం ఇప్పటికే వెయ్యికి పైగా ముందస్తు బుకింగ్లు వచ్చాయని పేర్కొంది. దీంతో వెయిటింగ్ పీరియడ్ సమయం 2-3 నెలలు.