న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘సిల్వర్ షాడో ఎడిషన్’ ఎక్స్4 మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ప్రారంభ ధర రూ.71.90 లక్షలు. చెన్నై ప్లాంట్లో తయారైన ఈ నూతన మోడల్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లలో లభించనున్నది. 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ కలిగిన మోడల్ కేవలం 6.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. ఈ కారు ధర రూ.71.90 లక్షలు. అలాగే 3 లీటర్ల డీజిల్ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించిన మోడల్ 5.8 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. ఈ కారు రూ.73.90 లక్షలుగా నిర్ణయించింది. ఈ రెండు మోడళ్ళు కొనుగోలు చేయాలనుకునేవారు సోమవారం నుంచి కంపెనీ వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది.