న్యూఢిల్లీ, డిసెంబర్ 16: సూపర్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ..సరికొత్త అడ్వెంచర్ టూర్ మోడల్ టీఆర్కే 251 బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధర రూ.2.51 లక్షలుగా నిర్ణయించింది. 250 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకు 25.8 పీఎస్ శక్తినివ్వనున్నది. మూడేండ్ల అన్లిమిటెడ్ కిలోమీటర్ వ్యారెంటీ ఇస్తున్న ఈ బైకు కోసం ముందస్తుగా రూ.6 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.