న్యూఢిల్లీ : లగ్జరీ కార్ల బ్రాండ్ వోల్వో కార్స్ ఇండియా భారత్ మార్కెట్లో న్యూ పెట్రోల్ హైబ్రిడ్ కార్ల శ్రేణి 2021 వోల్వో ఎక్స్సీ60 హైబ్రిడ్, ఎస్90 హైబ్రిడ్లను లాంఛ్ చేసింది. ఈ రెండు కార్లు దేశీ మార్కెట్లో రూ 61.90 లక్షలకు అందుబాటులో ఉంటారు. ఈ రెండు కార్లలో స్వల్ప మార్పులు చేపట్టిన వోల్వో పెట్రోల్-హైబ్రిడ్ పవర్ట్రైన్ కీలక మార్పుగా ముందుకు తీసుకువచ్చింది. అప్డేటెడ్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టంను జోడించింది. ఇక వోల్వో ఎస్90 హైబ్రిడ్ గ్లోబల్ లాంఛ్ గత ఏడాది జరగ్గా, ఎక్స్సీ 60 ఈ ఏడాది ఆరంభంలో గ్లోబల్ మార్కెట్లలో ఎంటరైంది.
వోల్వో ఎక్స్సీ 20 రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, అలాయ్ వీల్ డిజైన్తో ఆకట్టుకుంటుంది. ఈ కారు గూగుల్ మ్యాప్స్తో అప్డేటెడ్ ఆండ్రాయిడ్ ఆధారిత ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇక వోల్వో ఎస్90 హైబ్రిడ్ మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, ఆడి ఏ6, జాగ్వర్ ఎక్స్ఎఫ్లకు దీటైన పోటీ ఇవ్వనుండగా వోల్వో న్యూ ఎక్స్సీ60 హైబ్రిడ్ మోడల్ మెర్సిడెస్ బెంజ్ జీఎల్సీ, బీఎండబ్ల్యూ ఎక్స్3, ఆడి న్యూ క్వూ5లకు పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.