న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భారత్లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఎస్యూవీ సెగ్మెంట్లో పోటీని మరింత తీవ్రతరం చేయడానికి సిద్ధమైంది ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటర్. ఈ నెల చివర్లో సరికొత్త కారు అల్కాజర్ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్తో తయారు చేసిన ఈ మోడళ్ళలో ఆరు స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో తీర్చిదిద్దింది. దీంట్లో 2 లీటర్ల బీఎస్6 పెట్రోల్ ఇంజిన్ కలిగిన కారు 159 పీఎస్ల శక్తినివ్వనుండగా, అలాగే 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ మోడల్ 115 పీఎస్ ఇవ్వనున్నది.