బెంగళూరు, డిసెంబర్ 2: దేశంలో అతిపెద్ద ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ఎస్1 ఎక్స్ ప్లస్ మాడల్పై రూ.20 వేల రాయితీ ఇస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ మాడల్ రూ.89,999కే లభించనున్నది.ఈ స్కూటర్ను బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు వచ్చే వారం నుంచి డెలివరీ చేయనున్నట్లు తెలిపింది. 3 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ స్కూటర్ సింగిల్ రీచార్జితో 151 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. కేవలం 3.3 సెకండ్లలో 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మాడల్ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులతో ఆర్థిక లావాదేవీలు జరిపిన వారికి రూ.5 వేల వరకు రాయితీని ఆఫర్ చేస్తున్నది సంస్థ.. జీరో డౌన్పేమెంట్, జీరో ప్రాసెసింగ్ ఫీజు, 6.99 శాతం వడ్డీకే రుణాలు అందించడానికి సంస్థ పలు ఆర్థిక సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది కూడా.