Trade Deficit | న్యూఢిల్లీ, మార్చి 15: గత కొన్ని నెలలుగా నిరాశపనితీరు కనబరిచిన ఎగుమతులు మళ్లీ ఎగిశాయి. ఫిబ్రవరి నెలకుగాను ఎగుమతులు 11.9 శాతం పెరిగి 41.4 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒకే నెలలో గరిష్ఠ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి కావడం విశేషం. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇదే సమయంలో దిగుమతులు కూడా 12.16 శాతం అధికమై 60.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పసిడి దిగుమతులు అధికం కావడంతో వాణిజ్యలోటు 18.7 బిలియన్ డాలర్లకు ఎగబాకింది.