Bank Employees | న్యూఢిల్లీ, మార్చి 8: బ్యాంక్ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి. వార్షిక జీతాన్ని 17 శాతం పెంచే ప్రతిపాదనకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్లు శుక్రవారం ఒక అంగీకారానికి వచ్చాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని 8 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కల్పించే ఈ పెంపుతో బ్యాంక్లపై ఏడాదికి రూ. 8,284 కోట్ల భారం పడుతుంది. 2022 నవంబర్ నుంచి అమలయ్యేలా ఈ పెంపుదల ఉంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ వెల్లడించింది. వివరాలు:
ఐదు రోజులే పని
అలాగే శనివారాలన్నింటికీ సెలవులుగా గుర్తించేందుకు అంగీకరించినట్టు తెలిపింది. అయితే 5 రోజుల పనిదినాలపై ప్రభుత్వ అంగీకారం కోసం చూస్తున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత పనిగంటల సవరణ ఉంటుందని కాన్ఫడరేషన్ వివరించింది. వేతన ఒప్పందంపై పీఎస్యూ బ్యాంక్ యాజమాన్యాల అసోసియేషన్ ఐబీఏ, ఉద్యోగుల యూనియన్లు యూఎఫ్బీయూ, ఏఐబీవోఏ, ఏఐబీఏఎస్ఎం, బీకేఎస్ఎంలు సంతకాలు చేసినట్టు ఐబీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా ట్వీట్ చేశారు.