న్యూఢిల్లీ, మే 18:ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్..సరికొత్త ఈ-స్కూటర్ను ప్రవేశపెట్టింది. సింగిల్ చార్జ్తో 140 కిలోమీటర్ల ప్రయాణించే ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.98,564 నుంచి రూ.1,08,690 ధరల శ్రేణిల్లో లభించనున్నది. మూడు రకాలైన ఐక్యూబ్, ఐక్యూబ్ ఎస్, ఐక్యూబ్ ఎస్టీలలో లభించనున్నది.
కంపెనీ వెబ్సైట్లో రూ.999 చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చునని సూచించింది. ఒలా ఎలక్ట్రిక్, ఏథర్ ఏనర్జీ, హీరో ఎలక్ట్రిక్, బజాజ్ చేతక్ ఈవీలకు పోటీగా సంస్థ ఈ స్కూటర్లను పరిచయం చేసింది. ఈ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు 3.5 గంటల నుంచి 4.5 గంటల లోపు బ్యాటరీ పూర్తిగా రీచార్జి కానున్నది.