న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ కార్డ్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డు కలిగిన వారు ఆన్లైన్లో షాపింగ్ చేసిన వారికి 10 శాతం వరకు క్యాష్బ్యాక్ ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించింది. ‘దూందార్ దస్’ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్ అక్టోబర్ 3 నుంచి మూడు రోజులు మాత్రమే అమలులో ఉండనున్నదని పేర్కొంది. ఈ మూడు రోజులు ఏ ఈ-కామర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఈ ఆఫర్ వర్తించనున్నది. ఆన్లైన్లో షాపింగ్ చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వల్లనే ఈ ప్రత్యేక ఆఫర్ అందించినట్లు ఎస్బీఐ కార్డ్ సీఈవో, ఎండీ రామ్మోహన్రావు తెలిపారు. ఈఎంఐ ఆప్షన్ను ఎంచుకునే అవకాశాన్ని కూడా సంస్థ కల్పించింది.