బెంగళూరు, ఏప్రిల్ 19: ఐటీ సేవల సంస్థ విప్రో నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,834.6 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,074.5 కోట్లతో పోలిస్తే 7.8 శాతం తగ్గినట్లు పేర్కొంది.
గత త్రైమాసికానికిగాను సంస్థ రూ.22,208.3 కోట్ల ఆదాయాన్ని గడించింది. క్రితం ఏడాది వచ్చిన రూ.ఆదాయంతో పోలిస్తే 4.2 శాతం తగ్గింది.