న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: సెమికండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాహన దిగ్గజాలు ఏకంగా తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకుంటున్నాయి. వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా ఏకంగా 25 శాతం తగ్గించుకున్నట్లు గురువారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్లాంట్లలో ఉత్పత్తిని ఏడు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపింది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ప్రపంచవ్యాప్తంగా సెమికండక్టర్ల కొరత మరింత ఎక్కువైందని, దీంతో సంస్థ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తున్నదని బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థకు జహీరాబాద్తోపాటు చకాన్, నాసిక్, కందివాలి వద్ద ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.