న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బంగారం ధరలు మరింత తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల ధర రూ.340 తగ్గి రూ.51,100 స్థాయికి పడిపోయింది. ఇక రూ.1,000 తగ్గిన కిలో వెండి ధర రూ.59,720 నుంచి రూ.58,650కి జారుకున్నది.
హైదరాబాద్లోనూ 22 క్యారెట్ల తులం ధర రూ.700 తగ్గి రూ.46,900కి, 24 క్యారెట్ల ధర రూ.770 దిగొచ్చి రూ.51,160 స్థాయికి చేరుకున్నది. కిలో వెండి రూ.800 దిగి రూ.64 వేల స్థాయికి చేరుకున్నది. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,664 డాలర్లకు, వెండి 19.34 డాలర్లకు పడిపోయింది.