హైదరాబాద్, డిసెంబర్ 29: ఆభరణాల విక్రయ సంస్థ భీమా జ్యూవెల్స్ ప్రచారకర్తగా ప్రముఖ నటి శోభితా ధూళిపాల నియమితులయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ అభిశేక్ బిందుమాధవ్ మాట్లాడుతూ..
ఆభరణాల మార్కెట్లో బ్రాండ్కు మరింత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో శోభితా ధూళిపాలను బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థకు భారత్తోపాటు యూఏఈలో 60కి పైగా స్టోర్లు ఉన్నాయి.