ముంబై, జనవరి 16: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రకటించింది. ఈ స్కీంపై సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్న బ్యాంక్..ఇతరులకు 7.1 శాతం చొప్పున వడ్డీని చెల్లిస్తున్నది.
అలాగే 271 రోజుల బల్క్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది. పాత, కొత్త కస్టమర్లు బల్క్ డిపాజిట్ స్కీంలో చేరవచ్చునని, ఇందుకు సంబంధించి బ్యాంక్ బ్రాంచ్, ఆన్లైన్, మొబైల్ యాప్ ద్వారా కూడా డిపాజిట్ చేసుకునే అవకాశం కూడా బ్యాంక్ కల్పించింది.