న్యూఢిల్లీ : భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు గట్టిగా ఉన్నాయని నీతి ఆయోగ్ వైస్చైర్మన్ అరవింద్ పనగరియా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం తృతీయ, చివరి త్రైమాసికాల్లో జీడీపీ.. ప్రీ-కరోనా స్థాయిని దాటిందన్నారు. ఆదివారం ఆయన పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరితగతిన కోవిడ్-19ను జయించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై వస్తున్న వార్తలు అద్భుతం.. కానీ పౌరులు నిరంతరం బయటకు వెళ్లినప్పుడు మాస్క్లు ధరించాలని కోరారు.
గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో మూడవ, చివరి త్రైమాసికంలలో రియల్ జీడీపీ ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకున్నదని అరవింద్ పనగరియా చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 20.1 శాతం పెరిగిందన్నారు. కోవిడ్ రెండో వేవ్ తీవ్ర ప్రభావం చూపినా మాన్యుఫాక్చరింగ్, సర్వీస్ రంగాలు శరవేగంగా పుంజుకున్నాయని తెలిపారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పుంజుకుంటున్నాయని చెప్పారు.