హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలో తమ ఫుల్ఫిల్మెంట్ నెట్వర్క్ను విస్తరించేదిశగా 5వ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ (ఎఫ్సీ)ను ప్రారంభించినట్లు ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా గురువారం ప్రకటించింది. రెండు లక్షల చదరపు అడుగుల ఫ్లోర్ ఏరియాలో ఏర్పాటైన ఈ గిడ్డంగిలో ఆరు లక్షల క్యూబిక్ ఫీట్ స్టోరేజీ సామర్థ్యం ఉంటుంది. పెద్ద అప్లయెన్సెస్, ఫర్నిచర్ క్యాటగిరీతో సహా పలు ఉత్పత్తులను ఇందులో స్టోర్చేస్తారు. తమ విస్త్రృతమైన కస్టమర్ బేస్ను చేరేందుకు రాష్ట్రంలో 35,000కుపైగా అమ్మకందార్లకు ఈ ఎఫ్సీ ఉపకరిస్తుందని, తాజా విస్తరణతో తెలంగాణలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అమెజాన్ ఇండియా వివరించింది. ఈ 5వ ఎఫ్సీతో తెలంగాణలో తమ మొత్తం ఎఫ్సీ ఫ్లోర్ఏరియా 10 లక్షల చదరపు అడుగులకు, స్టోరేజీ సామర్థ్యం 50 లక్షల క్యూబిక్ ఫీట్లకు పెరిగిందని అమెజాన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్మెషిన్లు, టెలివిజన్లు వంటి ఉత్పత్తులతో సహా ఫర్నిచర్ క్యాటగిరీని వేలాదిగా స్టోర్చేసి, కస్టమర్లకు త్వరితంగా డెలివరీ చేసేందుకు ఎఫ్సీ సదుపాయాల్ని విస్తరించినట్లు అమెజాన్ ఇండియా డైరెక్టర్ అభినవ్సింగ్ తెలిపారు. తెలంగాణలో అమెజాన్ఇండియా గణనీయమైన పెట్టుబడులు&బిజినెస్, ఇన్నోవేషన్ హబ్గా రాష్ర్టానికి ఉన్న ఆకర్షణకు నిదర్శనమని ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.