భదాద్రి కొత్తగూడెం : గోదావరిలో వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఈ మధ్యాహ్ననికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులకు తగ్గింది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు అధికారులు తెలిపారు. 12 గంటల వ్యవధిలో సుమారు 6 అడుగుల మేర నదిలో నీటి ప్రవాహం తగ్గింది. నిన్న సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు భద్రాచలం వద్ద నది నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం క్రమంగా తగ్గడంతో హెచ్చరికలను ఉపసంహరిస్తున్నారు.