న్యూఢిల్లీ: మేనల్లుడు నీరవ్ మోదీతో కలిసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కాంలో దాదాపు రూ.14వేల కోట్లకు శఠగోపం పెట్టిన గీతాంజలి జ్యువెల్లర్స్ అధినేత మెహుల్ చౌక్సీ కొత్త ఎత్తు వేశారు. రెండు రోజుల క్రితం వరకు అంటిగ్వాలో ఉన్న చోక్సీ.. క్యూబాకు పారిపోయినట్లు సమాచారం.
ఈ కుంభకోణం వెలుగు చూస్తుండగానే నీరవ్ మోదీతో కలిసి భారత్ నుంచి పారిపోయారు. నీరవ్ మోదీ లండన్లో ప్రత్యక్ష్యం కాగా.. మెహుల్ చోక్సీ.. కరేబియన్ దేశాల్లో ఒకటైన అంటిగ్వా-బార్బుడాలో తల దాచుకున్నాడు.
ఆదివారం సాయంత్రం నుంచి మెహుల్ చోక్సీ కనిపించకుండా పోయాడని అంటిగ్వా పోలీసులు తెలిపారు. అలాగే, అతని ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు కూడా. అంటిగ్వాలోని మీడియా కథనాల ప్రకారం అతడు క్యూబాకు పారిపోయి ఉంటాడని తెలుస్తున్నది.
ఆదివారం ఓ విందులో పాల్గొనేందుకు బయటకు వెళ్లిన మెహుల్ చోక్సీ తిరిగి తర్వాత కనిపించలేదని పోలీసులు చెప్పారు. అదే రోజు సాయంత్రం జాలీ హర్బర్ ప్రాంతంలో అతడి కారును కనుగొన్నట్లు తెలిపారు. కానీ అందులో చోక్సీ కనిపించకపోవడంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
జాలీ హర్బర్ నుంచి సముద్ర మార్గంలో క్యూబాకు వెళ్లినట్లు తెలుస్తున్నది. క్యూబాలోనూ మెహుల్ చోక్సీకి ఆస్తులు ఉన్నాయి. మెహుల్ చోక్సీని అప్పగించాలని భారత్ నుంచి అంటిగ్వా సర్కార్పై ఒత్తిళ్లు పెరుగుతుండటంతో అతడు ముందుగానే జాగ్రత్త పడ్డాడని తెలుస్తున్నది.
2018 మార్చిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఇది బయటపడేలోపే నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ దేశాన్ని వీడారు. అంటిగ్వాలో పెట్టుబడులు పెట్టి పౌరసత్వం సంపాదించుకున్నాడు చోక్సీ.
అంటిగ్వా- భారత్ మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందమేమీ లేదు. భారత ప్రభుత్వం కోరితే చోక్సీని అప్పగించేందుకు సిద్ధం అని ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. తర్వాత మాట మార్చింది అంటిగ్వా సర్కార్.
2018లో స్కామ్ వెలుగు చూసినా, 2017లోనే అంటిగ్వా పౌరసత్వం సంపాదించడంలో చోక్సీ ముందు చూపుతో వ్యవహరించారు. తర్వాత అంటిగ్వాలో పెట్టుబడులు పెట్టడంతో వచ్చిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని భారత ప్రభుత్వం కోరింది.
కానీ తమ దేశంలో మెహుల్ చోక్సీ పెట్టుబడులు పెట్టినందున ఆయన పౌరసత్వం రద్దు చేయలేమని అంటిగ్వా సర్కార్ స్పష్టం చేసింది. కానీ మోదీ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడంతో అతడు క్యూబాకు మకాం మార్చాడని తెలుస్తున్నది.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!