తిరుమల : తన పుట్టినరోజును పురస్కరించుకుని టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే పలు ట్రస్ట్లకు ఆర్థిక చేయూతనందించారు. మే 1 న వైవీ సుబ్బారెడ్డి జన్మదినం. ఈ సందర్భంగా టీటీడీ నిర్వహిస్తున్న వివిధ ట్రస్టులకు రూ.90 లక్షలు విరాళంగా అందజేశారు. గతంలో ఎస్వీ గోశాలకు రూ.10 లక్షల విలువైన దేశీ ఆవులను విరాళంగా అందించారు. ఈసారి ట్రస్టుల ఆధ్వర్యంలో జరిగి వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా రూ. 90 లక్షలు అందజేసి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. స్వామి వారి ఆశీస్సులతో టీటీడీ పాలకమండలి చైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ఇటీవలనే రెండోసారి అవకాశం దక్కించుకున్నారు.