YSRCP | పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయింది. ఇటీవల పార్టీ ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్, మండలి చైర్మన్లకు వైసీపీ ఫిర్యాదు చేసింది.
వైసీపీ నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరారు. మరోవైపు ఎమ్మెల్సీ సీ. రామచంద్రయ్య టీడీపీలో చేరగా ఎమ్మెల్సీ వంశీ కృష్ణ యాదవ్ జనసేనలో చేరారు. వీరిపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పార్టీ తరఫున మండలి కార్యదర్శికి ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.