YSR Congress Party | వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం అయ్యేందుకు అధికారిక వైసీపీ ఇప్పటి నుంచి కార్యాచరణ ప్రారంభించింది. వివిధ నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, వివిధ సర్వేల ఆధారంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇన్ చార్జీలను మార్చేసింది. కొత్తగా 11 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇన్ చార్జీలను నియమించింది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలను కొత్త ఇన్ చార్జీలు పర్యవేక్షిస్తారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాకు తెలిపారు.
పత్తిపాడు ఎస్సీ స్థానంలో బాలసాని కిరణ్ కుమార్, కొండెపి (ఎస్సీ)లో ఆదిమూలపు సురేశ్, వేమూరు (ఎస్సీ)లో అశోక్ బాబు, తాటికొండ (ఎస్సీ)లో మేకతోటి సుచరిత, సంతనూతల పాడు (ఎస్సీ)లో మేరుగు నాగార్జున ఇన్ చార్జీలుగా వ్యవహరిస్తారు. చిలకలూరి పేట అసెంబ్లీ స్థానానికి రాజేశ్ నాయుడు, గుంటూరు వెస్ట్ స్థానంలో విడదల రజినీ, అద్దంకి నుంచి పాణెం హనిమి రెడ్డి, మంగళగిరిలో గంజి చిరంజీవి, రేపల్లెలో ఈవూరు గణేశ్, గాజువాక స్థానంలో వరికూటి రామచంద్రరావు ఇన్ చార్జీలుగా వ్యవహరిస్తారని బొత్స సత్యనారాయణ తెలిపారు.