హైదరాబాద్ : వైఎస్ వివేకానంద(YS Viveka Murder) హత్య కేసుపై వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి(Property) కోసం వివేకా హత్య జరగలేదని పేర్కొన్నారు. చిన్నాన్న వివేకా పేరుపై గాని చిన్నమ్మ పేరుపై గాని ఎప్పుడూ ఆస్తులు లేవని ఆమె వెల్లడించారు. ఆస్తులన్నీ కూతురు వైఎస్ సునీత(YS Sunita) పేరుమీద వీలునామా రాశారని స్పష్టం చేశారు.
ఉన్న చిన్నపాటి ఆస్తులను సునీత పిల్లలపై రాసి ఇచ్చారని షర్మిల తెలిపారు. వివేకానంద రెడ్డి ఆస్తుల విషయంలోనే హత్య జరిగిందని చేస్తున్న ప్రచారాలను ఆమె ఖండించారు. వైఎస్ వివేకానంద రెడ్డి ప్రజల మనిషని, ప్రజా నాయకుడని(Public leader) అన్నారు. వైఎస్సార్ కడప, పులివెందుల జిల్లా ప్రజానికానికి తన చిన్నాన్న గురించి బాగా తెలుసని, ఆయన సాధారణ జీవితం గడిపారని వెల్లడించారు.
నియోజకవర్గ ప్రజలకు ఏదేని సమస్యలు వస్తే వారితో కలిసి నేరుగా అధికారుల వద్దకు వెళ్లి పరిష్కరించేవారని ఆమె అన్నారు. రైలు ప్రయాణంలోనూ సాధారణ ప్రయాణికులతో కలిసి వెళ్లేవారని పేర్కొన్నారు. లేని వైఎస్ వివేకానందరెడ్డిపై వ్యక్తిగత విషయాలు ప్రస్తావించడం దారుణమని అన్నారు.